నేల మీద ఆకాశం ప్రతిబింబం!
ABN , First Publish Date - 2020-08-11T05:30:00+05:30 IST
నీళ్లలో, అద్దంలో ప్రతిబింబాన్ని చూడొచ్చు. మరి భూమిపై ప్రతిబింబం కనిపిస్తుందా? అని అడిగితే ‘కనిపించదు’ అని ఠక్కున సమాధానం చెబుతారు. కానీ ఈ కింది ఫొటో చూడండి...
నీళ్లలో, అద్దంలో ప్రతిబింబాన్ని చూడొచ్చు. మరి భూమిపై ప్రతిబింబం కనిపిస్తుందా? అని అడిగితే ‘కనిపించదు’ అని ఠక్కున సమాధానం చెబుతారు. కానీ ఈ కింది ఫొటో చూడండి. ఇందులో అకాశం ప్రతిబింబం భూమిమీద కనిపిస్తోంది. అదెలా అంటారా? అయితే చదవండి.
- ఆకాశం ప్రతిబింబం భూమిపై ఎలా కనిపిస్తోందీ! అంటే అక్కడ ఉప్పు ఎడారి ఉంది. ఆ తెల్లటి ఉప్పు ఎడారిలో ఆకాశం ప్రతిబింబం స్వచ్ఛంగా కనిపిస్తోంది.
- బొలీవియాలోని యుయుని అనే ప్రాంతంలో కనిపిస్తుందీ సుందరదృశ్యం. ఈ ప్రదేశాన్ని ‘యుయుని సాల్ట్ ఫ్లాట్స్’ అంటారు. ఇక్కడ ఉప్పు మెరిసిపోతూ ఉంటుంది. అందులో ఆకాశం ప్రతిబింబం కనిపిస్తుంది.
- నిజానికి ఇక్కడ ఉప్పు నీటి సరస్సు ఉండేదట. అది క్రమంగా ఎండిపోయి ఇప్పుడు ఉప్పు ఎడారిగా మారింది.
- ఇప్పుడీ ప్రాంతం పర్యాటక ప్రదేశంగా మారింది. దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఈ రమణీయ దృశ్యాన్ని చూసేందుకు వెళ్తుంటారు.