ఉత్తమ్‌తో మంత్రి తీరు సరికాదు

ABN , First Publish Date - 2020-06-02T09:27:08+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మంత్రి జగదీ్‌షరెడ్డి వ్యవహరించిన తీరు సరికాదని డీసీసీ

ఉత్తమ్‌తో మంత్రి తీరు సరికాదు

సూర్యాపేట టౌన్‌/నడిగూడెం/ నేరేడుచర్ల/ జూన్‌ 1 : టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మంత్రి జగదీ్‌షరెడ్డి వ్యవహరించిన తీరు సరికాదని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న అన్నారు.మంత్రి తీరును నిరసిస్తూ సోమవారం సూర్యాపేట, నడిగూడెం పట్టణాల్లో ఆయన దిష్టిబొమ్మను కాంగ్రెస్‌ నాయకులు దహనం చేశారు. మంత్రి తీరు వీధిరౌడిలను గుర్తుచేస్తున్నట్లుందని నాయకులు విమర్శించారు.ఆయా కార్యక్రమాల్లో చకిలం రాజేశ్వర్‌రావు, అంజద్‌అలీ, కుమ్మరికుంట్ల వేణుగోపాల్‌, కొండపల్లి సాగర్‌, కౌన్సిలర్లు మడిపల్లి విక్రమ్‌, శ్రీనివాస్‌, బైరు శైలేందర్‌గౌడ్‌, నడిగూడెంలో ఎంపీటీసీ గుండుశ్రీను, నాయకులు వేపూరి సుధీర్‌, నాగరాజు, వంశీ పాల్గొన్నారు.


అదేవిధంగా నేరేడుచర్ల, పాలకవీడులో కాంగ్రెస్‌ నాయకులు విలేకర్లతో మాట్లాడుతూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని విమర్శించడం హేయమైన చర్య అన్నారు. రైతు సమస్యలపై ప్రశ్నిస్తే విమర్శించడం సరికాదన్నారు. నేరేడుచర్లలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కొణతం చినవెంకటరెడ్డి, బచ్చలకూరి ప్రకాష్‌, నూకల సందీ్‌పరెడ్డి, పాలకవీడులో ఎంపీపీ గోపాల్‌నాయక్‌, మోతీలాల్‌, నాగిరెడ్డి, ఉపేందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-02T09:27:08+05:30 IST