మందులు ఐదు రోజులకే ఇస్తున్నారు!

ABN , First Publish Date - 2022-09-25T10:04:42+05:30 IST

విజయవాడ కొత్తాసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రోగుల సమస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నించారు. మందుల కౌంటర్‌ వద్ద ఓ మహిళను..

మందులు ఐదు రోజులకే ఇస్తున్నారు!

రోగి ఆవేదన.. జీజీహెచ్‌ 

అధికారులపె మంత్రి ఆగ్రహం 


విజయవాడ, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): విజయవాడ కొత్తాసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రోగుల సమస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నించారు. మందుల కౌంటర్‌ వద్ద ఓ మహిళను సమస్యలు ఏమైనా ఉన్నాయా అని రజిని అడగ్గా.. సదరు మహిళ దీర్ఘకాలిక రోగాలకూ  ఐదు రోజులకు మాత్రమే మందులు ఇస్తున్నారని, అంతకు ముందు 15 రోజులు ఇచ్చేవారని చెప్పారు. మందుల కోసం మరోసారి రావాలని సూచిస్తున్నారని, ఇది నాబోటి రోగులకు  చాలా ఇబ్బందిగా ఉందని తెలిపారు. దీంతో మంత్రి జీజీహెచ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, బడ్జెట్‌ తక్కువగా ఉందని, మందులన్నీ సీడీఎ్‌సలో అందుబాటులో ఉండడం లేదని జీజీహెచ్‌ అధికారులు వివరణ ఇచ్చారు. మందుల విషయమై హెచ్‌డీఎస్‌ సమావేశంలోనూ చర్చించుకున్నట్లు చెప్పారు. 

Updated Date - 2022-09-25T10:04:42+05:30 IST