అంగరంగ వైభవంగా జగన్నాథుని కల్యాణం

ABN , First Publish Date - 2022-07-01T06:37:24+05:30 IST

జగన్నాథ, సుభద్రల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. టౌన్‌ కొత్తరోడ్డులోని జగన్నాథస్వామి ఆలయంలో రథయాత్ర మహోత్సవాల సందర్భంగా గురువారం ఉదయం పూర్ణాహుతి నేత్రోత్సవం నిర్వహించారు. సాయంత్రం సుభద్రాదేవి శాంతి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

అంగరంగ వైభవంగా జగన్నాథుని కల్యాణం
కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్న అర్చకులు

మహారాణిపేట, జూన్‌ 30: జగన్నాథ, సుభద్రల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. టౌన్‌ కొత్తరోడ్డులోని జగన్నాథస్వామి ఆలయంలో రథయాత్ర మహోత్సవాల సందర్భంగా గురువారం ఉదయం పూర్ణాహుతి నేత్రోత్సవం నిర్వహించారు. సాయంత్రం సుభద్రాదేవి శాంతి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ పూజారుల ఆధ్వర్యంలో వేదపండితులు ముందుగా విశ్వక్సేనుని పూజ, శుద్ధి పుణ్యాహవచనం, రక్షా బంధం చేశారు. కన్యావరణం, కన్యాదానం, సుమూహూర్తం, సూత్రధారణ తలంబ్రాలు బ్రహ్మముడులతో స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T06:37:24+05:30 IST