ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ABN , First Publish Date - 2021-04-16T10:19:42+05:30 IST
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇద్దరు కానిస్టేబుళ్లను కత్తితో పీక కోసి హత్య చేశారు. ఈ ఘటన సుక్మా జిల్లాలో
ఇద్దరు కానిస్టేబుళ్లను పీక కోసి హత్య చేసిన వైనం
చింతూరు, ఏప్రిల్ 15: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇద్దరు కానిస్టేబుళ్లను కత్తితో పీక కోసి హత్య చేశారు. ఈ ఘటన సుక్మా జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. చింతల్నార్కి చెందిన పూనెంహర్మ, జేగురుగొండకు చెందిన ధనిరాంకశ్యప్ సుక్మా జిల్లాలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై గురువారం కుంట ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని తిరిగి బెజ్జి బేస్ క్యాంపునకు బయల్దేరారు. మార్గమధ్యంలో కాసుకుని కూర్చున్న మావోయిస్టులు కానిస్టేబుళ్లను అటకాయించి కత్తితో పీక కోసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.