చదువుకోమని కూతురికి చెబుతుండగా లోపలికి వచ్చిన బావ.. కాసేపటికి బయటికి వెళ్లి భర్తకు ఫోన్ చేసిన మహిళ.. చివరకు..

ABN , First Publish Date - 2022-05-25T02:09:42+05:30 IST

రాను రాను కొందరు వయసు, వరస మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అక్క, చెల్లెలు, మరదలు అనే బంధాలను పక్కన పెట్టి.. అందరినీ వక్ర దృష్టితో చూస్తుంటారు. ఇలాంటి వారు చివరకు అందరితో ఛీకొట్టించుకుని, జైలుపాలవుతుంటారు..

చదువుకోమని కూతురికి చెబుతుండగా లోపలికి వచ్చిన బావ.. కాసేపటికి బయటికి వెళ్లి భర్తకు ఫోన్ చేసిన మహిళ.. చివరకు..

రాను రాను కొందరు వయసు, వరస మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అక్క, చెల్లెలు, మరదలు అనే బంధాలను పక్కన పెట్టి.. అందరినీ వక్ర దృష్టితో చూస్తుంటారు. ఇలాంటి వారు చివరకు అందరితో ఛీకొట్టించుకుని, జైలుపాలవుతుంటారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువవడం చూస్తూనే ఉన్నాం. బీహార్‌లో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. చదువుకోమని కూతురిని మందలిస్తుండగా బావ లోపలికి వచ్చాడు. ఎందుకిలా చేస్తున్నావంటూ గొడవ పెట్టుకున్నాడు. కాసేపటికి బయటికి వెళ్లిన ఆమె.. భర్తకు ఫోన్ చేసింది. తర్వాత జరిగిన ఘటన తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


బీహార్ రాష్ట్రం బెగుసరాయ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన మోనాదేవి అనే మహిళకు భర్త, కుమార్తె ఉన్నారు. వీరి కుటుంబంలో ఎలాంటి సమస్యలూ లేవు. అయితే మోనాదేవి భర్త సోదరుడి కారణంగా వీరికి సమస్యలు వచ్చిపడ్డాయి. తమ్ముడి భార్యను అన్న వక్రదృష్టితో చూసేవాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మోనాదేవి మాత్రం అతడికి దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో మరదలిపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మోనాదేవి తన కూతురిని చదువుకోమని మందలించింది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఆమె బావ.. ఎందుకు కూతురిని తిడుతున్నావంటూ గొడవ పెట్టుకున్నాడు. మోనాదేవి ఎదురుతిరగడంతో దుర్భాషలాడాడు.

అర్ధరాత్రి ఇంటి నుంచి మహిళ అరుపులు.. గోడ దూకి పారిపోయిన యువకుడిని చూసిన స్థానికులు.. కంగారుగా గదిలోకి వెళ్లి చూడగా..


దీంతో ఏడుస్తూ బయటికి వెళ్లిన మోనాదేవి.. పక్కింట్లో నుంచి భర్తకు ఫోన్ చేసి, విషయం తెలియజేసింది. కాసేపటికి అక్కడికి చేరుకున్న మోనాదేవి భర్తకు, ఆమె బావకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మరింత ఆగ్రహానికి గురైన మోనాదేవి బావ.. ఒక్కసారిగా కత్తితో ఆమెపై దాడికి దిగాడు. తీవ్రగాయాలపాలైన బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తన ఇష్టప్రకారం నడుచుకోలేదనే కారణంతో కావాలనే గొడవ పెట్టుకుని, తనపై దాడి చేశాడని బాధితురాలు ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అబార్షన్‌కు అనుమతి కోసం హైకోర్టు‌కు ఓ యువతి.. ఆమె చెప్పిన నిజాలు విని నివ్వెరపోయిన న్యాయమూర్తి.. చివరకు..

Updated Date - 2022-05-25T02:09:42+05:30 IST