లారీ ఢీకొని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-04-13T06:33:42+05:30 IST
లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు.
ఎదుటి నుంచి ఢీకొట్టిన లారీ
తిరుమలగిరి రూరల్, ఏప్రిల్ 12: లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలం రత్నపురం గ్రామానికి చెందిన వెలుగు కర్ణాకర్(37) బంధువుల గ్రామం మామిడాల కు బైక్పై వెళ్లి తిరిగి వస్తుండగా సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో చింతలకుంటతండా శివారులో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కర్ణాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.