వ్యక్తి దారుణ హత్య

ABN , First Publish Date - 2022-08-20T05:23:24+05:30 IST

మండలంలోని ఎగువపల్లి గ్రామ సమీపంలో నాగేష్‌ (42) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండుగులు నాగే్‌షను హతమార్చి రైలు పట్టాల పై వేసి ఆత్మహత్యగా చిత్రికరించేందుకు యత్నించిన ఘటన శుక్రవారం జరిగింది.

వ్యక్తి దారుణ హత్య
నాగేష్‌ (ఫైల్‌)

  రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరణ

 వివాహేతర సంబంధమే కారణమా ?


గార్లదిన్నె, ఆగస్టు 19: మండలంలోని ఎగువపల్లి గ్రామ సమీపంలో నాగేష్‌ (42) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండుగులు నాగే్‌షను హతమార్చి రైలు పట్టాల పై వేసి ఆత్మహత్యగా చిత్రికరించేందుకు యత్నించిన ఘటన శుక్రవారం జరిగింది. బంధు వులు, పోలీసుల సమాచారం మేరకు... శింగనమల మండలం కల్లుమడి గ్రామానికి చెందిన కొండయ్య పెద్దకుమారుడు నాగేష్‌ వ్యవసాయంతో పాటు వరికోత యంత్రాలతో జీవనం సాగించేవాడు. పనుల నిమిత్తం ప్రతిరోజు ఉదయం వెళ్లి చీకటి పడగానే ఇంటికి వచ్చేవాడ న్నారు. గురువారం రాత్రి ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఫోన చేయగా సెల్‌ స్విచఆ్‌ఫ అయి ఉంది. శుక్రవారం ఉదయం రైలు పట్టాలపై శవమై కనిపించాడు. విషయం తెలుసుకు న్న రైల్వే సీఐ నాగరాజు, శింగనమల సర్కిల్‌ సీఐ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరి శీలించారు. తొలుత ఆత్మహత్యగా భావించారు. అయితే ఘటనా స్థలం సమీపంలో ద్విచక్ర వాహనం నిలిపి ఉండటం, అక్కడ రక్తపు మరకలు కనిపించడం అనుమానాలకు దారితీసింది.  పోలీసులు డాగ్‌ స్కాడ్‌ను పిలిపించి పరిశీలించారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. నాగే్‌షకు అదే గ్రామానికి చెందిన మునిస్వామి అనే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తన భర్తను ఆయనే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుడి భార్య నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి ఇద్దరు పిల్లలున్నారు.

Updated Date - 2022-08-20T05:23:24+05:30 IST