చెట్టు పైనుంచి జారిపడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-02-28T05:43:15+05:30 IST

చెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన పాపయ్య వలస గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

చెట్టు పైనుంచి జారిపడి వ్యక్తి మృతి

మక్కువ: చెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన పాపయ్య వలస గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ బీవీ రమణ తెలిపిన వివరా లిలా ఉన్నాయి. సీతానగరం మండలం చినభోగిలికి చెందిన లోపింటి గంగరాజు(36) కొబ్బరిబొండాల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తు న్నాడు. ఈక్రమంలో ఆయన మక్కువ మండలం పాపయ్యవలసలో కొబ్బరి బొండాలు కొనుగోలు చేసేందుకు వచ్చాడు. ఆ గ్రామంలో కొబ్బరిబొండాలు కిందకు దించడానికి చెట్టు ఎక్కాడు. పట్టు తప్పడంతో చెట్టుపై నుంచి జారి పడి, అక్కడి కక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్టు ఏఎస్‌ఐ బీవీ రమణ తెలిపారు. బొండాలు కొనుగోలు చేసి వెంటనే వచ్చేస్తానని చెప్పి వెళ్లిన తన భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో భార్య జ్యోతి కన్నీరుమున్నీరుగా విలపి స్తోంది. మృతునికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. 

 

Updated Date - 2021-02-28T05:43:15+05:30 IST