ఒకే వ్యక్తితో తల్లీకూతుళ్ల ప్రేమాయణం.. సీక్రెట్గా వాళ్ల వ్యవహారంపై నిఘా వేశాడో వ్యక్తి.. చివరకు..
ABN , First Publish Date - 2021-07-27T21:09:41+05:30 IST
ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి ఒకేసారి తల్లికూతుళ్లతో ప్రేమాయణం నడిపించాడు..
ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి ఒకేసారి తల్లికూతుళ్లతో ప్రేమాయణం నడిపించాడు.. ఇద్దరితోనూ ఒకేసారి రాసలీలలు సాగించాడు.. వీళ్లపై ఓ వ్యక్తి నిఘా వేశాడు.. అసలు విషయం తెలుసుకుని మహిళల కుటుంబ సభ్యుడికి చెప్పాడు.. దీంతో ఈ ముగ్గురూ అతడిపై కోపం పెంచుకుని హత్య చేశారు.. కాన్పూర్లోని కొహానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
కొహానా ప్రాంతానికి చెందిన భరత్ అనే యువకుడికి తన తల్లి, సోదరి.. రంజిత్ అనే వ్యక్తితో చనువుగా ప్రవర్తించడంపై అనుమానం కలిగింది. ఈ వ్యవహారంపై నిఘా పెట్టి అసలు విషయం చెప్పమని తన స్నేహితుడు నవీన్ను అడిగాడు. దీంతో నవీన్ వారిపై నిఘా పెట్టి అసలు విషయం తెల్చేశాడు. రంజిత్తో తల్లికూతుళ్లిద్దరూ ఒకేసారి రాసలీలలు సాగిస్తున్నారని భరత్కు చెప్పాడు. నవీన్ తమపై నిఘా పెట్టిన విషయం ఆ ముగ్గురికీ తెలిసింది.
వారు నవీన్ను చంపాలని ప్లాన్ చేశారు. సోమవారం ఉదయం నవీన్ను రంజిత్ బలవంతంగా వేరే ప్రాంతానికి తీసుకెళ్లి మహిళల ఇద్దరి సహాయంతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి ముగ్గురూ పరారయ్యారు. నవీన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించి అసలు విషయం బయటపెట్టారు. నవీన్ను చంపినందుకు రంజిత్ను, తల్లికూతుళ్లు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.