చెరువులో పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-05-23T05:50:08+05:30 IST

చెరువులో పడి వ్యక్తి మృతి

చెరువులో పడి వ్యక్తి మృతి

ఆమనగల్లు, మే 22: చెరువులో స్నానానికి వెళ్లిన వ్యక్తి మృతిచెందిన ఘటన తలకొండపల్లి మండలంలోని వెల్జాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాయిపల్లి గ్రామానికి చెందిన ముదిగొండ ఆనందం(42) గ్రామ సమీపంలోని చౌదర్‌పల్లి గ్రామంలో జరిగిన బొడ్రాయి ప్రతిష్ఠ వేడుకలకు వెళ్లాడు. ఉదయం ఇద్దరు వ్యక్తులతో కలిసి వెల్జాల గ్రామ సమీపంలోని సహదేవి సముద్రం చెరువు వద్దకు వచ్చి చెరువులో స్నానానికి వెళ్లాడు. ఈత రాకపోవడంతో వెంటవెళ్లిన వారు చెరువు బయట ఉండిపోయినట్లు సమాచారం. కొద్దిసేపటి తరువాత చెరువు నీళ్లలో ఆనందం తల బయటకు కనబడటంతో అనుమానం వచ్చిన సమీపంలో ఉన్న కొందరు పోలీసులకు సమాచారం అందించారు. కాగా అప్పటికే ఆనందం మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వరప్రసాద్‌ తెలిపారు. ఆనందం మృతి అనుమానాస్పదంగా ఉందని స్థానికులు చర్చించుకున్నారు. 

Updated Date - 2022-05-23T05:50:08+05:30 IST