చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-02-25T03:56:28+05:30 IST

చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని నాయినోనిపల్లిలో బుధవారం చోటు చేసుకుంది.

చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

హన్వాడ,ఫిబ్రవరి 24: చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని నాయినోనిపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొండా రాములు (30) చింతచెట్టు ఎక్కి చింతకాయలు కొస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి మృతి చెందాడు. మృతుడి భార్య స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్‌ తెలిపారు. బాధితుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. 

Updated Date - 2021-02-25T03:56:28+05:30 IST