చికిత్సపొందుతూ వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-01-24T04:47:14+05:30 IST
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్సపొందూ ఓ వ్యక్తి మృతిచెందాడు.
ఎల్లారెడ్డి, జనవరి 23: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్సపొందూ ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎల్లారెడ్డి మండలంలోని హసన్పల్లి గేట్ వద్ద ఈ నెల 21న కమ్మరి అనిల్(30) రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబా ద్కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపారు. భార్య కమ్మరి సౌం దర్య ఫీర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.