అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-10-20T07:10:36+05:30 IST

పట్టణంలోని చంద్రాస్‌ లాడ్జిలో గుంటూరుకు చెందిన వసంతప్రసాద్‌ (52) అనే వ్యక్తి అ నుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కదిరి,  అక్టోబరు 19: పట్టణంలోని చంద్రాస్‌ లాడ్జిలో గుంటూరుకు చెందిన వసంతప్రసాద్‌ (52) అనే వ్యక్తి అ నుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పట్టణ సీఐ సత్య బాబు తెలిపిన వివరాల మేరకు గుంటూరుకు చెందిన వసం తప్రసాద్‌ వ్యాపారాల నిమిత్తం కదిరికి వచ్చి సోమవారం రాత్రి చంద్రాస్‌ లాడ్జిలో బస చేశాడు. రాత్రి కుటుంబ సభ్యు లతో మాట్లాడాడు. ఉదయం కుటుంబ సభ్యులు మృతునితో మాట్లాడటానికి ప్రయత్నించగా ఫోన్‌ తీయక పోవడంతో లాడ్జి యజమానులకు సమాచారం ఇచ్చారు. లాడ్జి యజ మానులు తలుపులు పోలీసుల సమక్షంలో తెరిచి చూడగా వసంతప్రసాద్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి గతంలో తీవ్ర గుండెనొప్పితో బాధపడుతూ ఉన్న ట్లు కు టుంబ సభ్యులు తెలిపారని సీఐ తెలిపారు. దీని పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొ న్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తర లించామన్నారు. 

Updated Date - 2021-10-20T07:10:36+05:30 IST