అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-05-11T05:15:39+05:30 IST

మండలంలోని బురెడ్డిపల్లి గ్రామ సమీపంలో అను మానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి (60) మృతి చెందాడు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

జడ్చర్ల, మే 10 : మండలంలోని బురెడ్డిపల్లి గ్రామ సమీపంలో అను మానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి (60) మృతి చెందాడు. జడ్చర్ల సీఐ వీరస్వామి కథనం మేరకు.. బు రెడ్డిపల్లి శివారులో ఓ వ్యక్తి మృతి చెందాడన్న సమాచారం మేరకు సం ఘటనా స్థలాన్ని పరిశీలించామన్నా రు. మృతుడు తెల్ల రంగు చొక్కా, బ ట్టతో కుట్టిన నిక్కరు ధరించి ఉన్నాడ ని చెప్పారు. నుదుటిపై, చేతులపై గాయాలు ఉన్నాయని వివరించారు. మృతదేహాన్ని పో స్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించామని చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.



Updated Date - 2021-05-11T05:15:39+05:30 IST