వ్యక్తి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2021-09-29T06:00:31+05:30 IST

తురకవారిపల్లికి చెందిన కాటం శివయ్య (32) మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పదస్థితిలో మరణించాడు.

వ్యక్తి అనుమానాస్పద మృతి
మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు


తాడిమర్రి, సెప్టెంబరు 28 : తురకవారిపల్లికి చెందిన కాటం శివయ్య (32) మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పదస్థితిలో మరణించాడు. అతనికి భార్య వసంతలు, పిల్లలు భూమి, సంధ్య, రతీశ ఉన్నారు. తాగుడుకు బానిసైన  శివయ్య ప్రతి రోజూ భార్యతో గొడవ పడేవాడు. దీంతో ఇటీవల ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథఽ్యంలో ఈనెల 26న భార్య, ఆమె బంధువులు శివయ్యను చితకబాదారు. అనంతరం శివయ్య తనకు ఛాతిలో నొప్పిగా ఉందని సోమవారం చికిత్స నిమిత్తం పార్నపల్లికి వెళ్లగా అక్కడి వైద్యులు అనంతపురం, పులివెందులకు వెళ్లమని సూచించారు. ఇంటికి చేరుకున్న శివయ్య మంగళవారం తెల్లవారుజామున మరణించాడు.  శివయ్య తల్లి సంజమ్మ తన కుమారుడి మృతికి వసంతలు, ఆమె బంధువులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపారు.


Updated Date - 2021-09-29T06:00:31+05:30 IST