ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-01-21T07:49:10+05:30 IST

మండలంలోని సజ్జలదిన్నె సమీపంలో ఉన్న సున్నం బట్టీ వద్ద బుధవారం ప్రమాదంలో రాజశేఖర్‌ (40) అనే వ్యక్తి మృతిచెందాడని పోలీసులు తెలిపారు.

ప్రమాదంలో వ్యక్తి మృతి


తాడిపత్రిరూరల్‌, జనవరి20: మండలంలోని సజ్జలదిన్నె సమీపంలో ఉన్న సున్నం బట్టీ వద్ద బుధవారం ప్రమాదంలో రాజశేఖర్‌ (40) అనే వ్యక్తి మృతిచెందాడని పోలీసులు తెలిపారు. సున్నం బట్టీ వద్ద ట్రాలీని రిపేరి చేస్తుండగా ప్రమాదవశాత్తు దాని ముందు భాగం పడి రాజశేఖర్‌ అక్కడికక్కడే మృతిచెందాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.


గుర్తు తెలియని వాహనం ఢీకొని మరొకరు..

పామిడి, జనవరి 20 : పట్టణంలోని 44వ జాతీ య రహదారిపై నల్లప్ప(37) బుధవారం రాత్రి గుర్తుతెలియని వాహ నం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. సీఐ శ్యామరావు తెలిపిన మేర కు పట్టణంలోని చైతన్యకాలనీలో నివాసముంటున్న నల్ల ప్ప ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్నాడు. అదే సమయం లో గుత్తి నుంచి అనంతపురం వైపు వెళ్తున్న గుర్తుతెలియని వా హనం ఢీ కొనడంతో అతడు మృతి చెందినట్లు సీఐ తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు.


Updated Date - 2021-01-21T07:49:10+05:30 IST