పేదలను దోచుకునేందుకే ఎల్ఆర్ఎస్
ABN , First Publish Date - 2020-10-01T10:18:00+05:30 IST
పేదలను దోచుకునేందుకే రాష్ట్ర ప్రభు త్వం ఎల్ఆర్ఎస్ తీసుకువచ్చిందని బీజేపీ నాయకులు ఆరోపించారు
బోధన్లో బీజేపీ నాయకుల రాస్తారోకో
బోధన్రూరల్, సెప్టెంబరు 30 : పేదలను దోచుకునేందుకే రాష్ట్ర ప్రభు త్వం ఎల్ఆర్ఎస్ తీసుకువచ్చిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. బుధ వారం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం నాగన్పల్లి వద్ద బీజేపీ ఆధ్వ ర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ పథకాన్ని రద్దు చేయాలని డి మాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు పోశెట్టి, అశోక్గౌడ్, సంపత్, నర్సింలు, ప్రవీణ్, మహేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.