ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ

ABN , First Publish Date - 2022-05-17T09:02:33+05:30 IST

అతివేగం ముగ్గురి ప్రాణాలు తీసింది. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం తానామిట్ట వద్ద సోమవారం ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దుర్మరణం.. మహిళ పరిస్థితి విషమం


మదనపల్లె క్రైం, మే 16: అతివేగం ముగ్గురి ప్రాణాలు తీసింది. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం తానామిట్ట వద్ద సోమవారం  ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సహా ఓ యువకుడు మృతిచెందాడు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ్ల తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లెకు చెందిన ఖాదర్‌బాషా (19), అతడి పెదనాన్న కుమార్తె అజీరా (36), ఆమె పిల్లలు జోయా (8), జునెద్‌ (6) సోమవారం ద్విచక్రవాహనంపై మదనపల్లెలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. సాయంత్రం తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. దారిలో కురబలకోట మండలం తానామిట్ట వద్ద ఎదురుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొంది. ఘటనలో ద్విచక్రవాహనం లారీ ముందు చక్రాల కిందకు దూసుకెళ్లింది. ప్రమాదంలో ఖాదర్‌బాషా, జోయా, జునెద్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందగా అజీరా తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ముదివేడు పోలీసులకు సమాచారం అందించి అజీరాను చికిత్సనిమిత్తం 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతికి రెఫర్‌ చేశారు.  ఎస్‌ఐ సుకుమార్‌ సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి ఘటనపై ఆరా తీశారు.  కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - 2022-05-17T09:02:33+05:30 IST