‘రుణ సమయం ఈ నెల 31 వరకు పెంచాలి’
ABN , First Publish Date - 2022-08-11T04:51:57+05:30 IST
దివ్యాంగుల రుణ సమయం ఈ నెల 31 వరకు పెంచాలని, అలాగే షూరిటీ లేకుండా రుణాలు ఇవ్వాలని వికలాంగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కర్నూలు(కలెక్టరేట్), ఆగస్టు 10: దివ్యాంగుల రుణ సమయం ఈ నెల 31 వరకు పెంచాలని, అలాగే షూరిటీ లేకుండా రుణాలు ఇవ్వాలని వికలాంగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం వద్ద వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణస్వామి మాట్లాడుతూ పోరాటాల ఫలితంగా వికలాంగులకు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ నెల 16వ తేదీన దరఖాస్తు చివరి తేదీగా నిర్ణయించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం పునరాలోచించి ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు గడువు పెంచాలని విన్నవించారు. అదేవిధంగా వికలాంగులకు షూరిటీ లేకుండా రుణాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.