పేదల బతుకు గగనంగా మారింది
ABN , First Publish Date - 2022-08-14T05:06:00+05:30 IST
మండలంలోని లేబాక గ్రామంలో శనివారం టీడీపీ మండల అధ్యక్షుడు జంగంశెట్టి సుబ్బయ్య ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.
బాదుడే.. బాదుడు కార్యక్రమంలో టీడీపీ నేతలు
నందలూరు, ఆగస్టు 13 : మండలంలోని లేబాక గ్రామంలో శనివారం టీడీపీ మండల అధ్యక్షుడు జంగంశెట్టి సుబ్బయ్య ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ రీజియన్ మాజీ చైర్మన్ ఎద్దల సుబ్బరాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు జంగంశెట్టి సుబ్బయ్య, మండల క్లస్టర్ ఇన్చార్జి పసుపులేటి ప్రవీణ్ మాట్లాడుతూ ఆర్టీసీ చార్జీలు, పెట్రోలు గ్యాస్, కరెంటు చార్జీలు పెంచుకుంటూ పోతుండడంతో పేద ప్రజ లు బతకడమే కష్టంగా మారిందన్నారు. జగన్మోహన్రెడ్డి చేస్తున్న దోపిడీని వివరించి తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభి వృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నందలూరు సర్పంచ్ మోడపోతుల రాము, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు జ్యోతి శివ, రాజంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తాటి సుబ్బరాయుడు, టీడీపీ నాయకులు శ్రీధర్ బాబు యాదవ్, పాటూరు రమేష్, గంధం గంగాధర్, ఉప్పుశెట్టి రెడ్డయ్య, మందపల్లె శ్రీను, చెన్నయ్యగారిపల్లె కుమార్, నారపుశెట్టి శివయ్య, చుక్క యానాది, సురేష్ తదితరులు పాల్గొన్నారు.