విజన్ ఉన్న నాయకుడు మంత్రి కేటీఆర్
ABN , First Publish Date - 2021-07-25T05:35:41+05:30 IST
సీఎం కేసీఆర్ అడుగుజాడలో నడుస్తూ రాష్ట్ర ఐటీ రంగానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చి, మంచి విజన్ ఉన్న నాయకుడిగా మంత్రి కేటీఆర్ పేరు తెచ్చుకున్నారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే కంచర్ల కంచర్ల భూపాల్రెడ్డి
జిల్లా వ్యాప్తంగా మంత్రి పుట్టినరోజు వేడుకలు
( ఆంధ్రజ్యోతి-న్యూస్నెట్వర్క్)
సీఎం కేసీఆర్ అడుగుజాడలో నడుస్తూ రాష్ట్ర ఐటీ రంగానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చి, మంచి విజన్ ఉన్న నాయకుడిగా మంత్రి కేటీఆర్ పేరు తెచ్చుకున్నారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాయంలో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐటీ రంగాన్ని మరింత సమర్థంగా నిర్వహిస్తూ ప్రపంచ దేశాలను ఆకర్శిస్తూ ఐటీ రంగాన్ని విస్తరింపజేస్తు న్నారని అన్నారు. ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వరుసకడుతు న్నాయని అందుకుకారణం కేటీఆర్ చేస్తున్న కృషియే కారణమని అన్నారు. యువతరాన్ని దృష్టిలో పెట్టుకున్ని ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకు వస్తున్నారని అన్నారు. కంపెనీలు రావడం వల్ల నిరుద్యోగ సమస్య కూడా తీరుతుందన్నారు. నిరంతరం ప్రజా సేవకే అంకితమైన మంత్రి కేటీఆర్కు దేవుడు ఆయురారో గ్యాలు ప్రసాధించాలని కోరారు. ఈసందర్భంగా ఎస్ఎల్బీసీలో నూతనంగా నిర్మించతలపెట్టిన మెడికల్ కళాశాల ఆవరణలో పెద్దఎత్తున మొక్క లు నాటారు. నల్లగొండ పట్టణంలో పలు వార్డుల్లో నాయకులు, కౌన్సిలర్లు అన్నదాన కార్యక్రమాలు, హరితహారం కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, యూనివర్శిటీ సెనేట్ సభ్యుడు బోయినపల్లి కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోర్రసుధాకర్, ఎంపీపీ నాగువంచ విజయలక్ష్మి, తిప్పర్తి జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, నాయకులు నిరంజన్వలి, కటికం సత్తయ్యగౌడ్, సుంకరి మల్లేష్గౌడ్, రెడ్క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్రెడ్డి, మాలే శరణ్యారెడ్డి, సింగం రాంమోహన్ పాల్గొన్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ జన్మదినవేడుకలు నిర్వహించారు. మిర్యాలగూడలో శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్రావు మొక్కలు నాటారు.