కనీసం 50 లక్షల మంది వినియోగదారులుంటే.. తాజా ఐటీ నిబంధనలు వర్తిస్తాయి: కేంద్రం
ABN , First Publish Date - 2021-02-28T09:29:39+05:30 IST
కనీసం 50 లక్షలమంది లేదా ఆపై వినియోగదారులున్న సామాజిక మాధ్యమ సంస్థలకు తాము తాజాగా ప్రవేశపెట్టిన ఐటీ నిబంధనలు వర్తిస్తాయని
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: కనీసం 50 లక్షలమంది లేదా ఆపై వినియోగదారులున్న సామాజిక మాధ్యమ సంస్థలకు తాము తాజాగా ప్రవేశపెట్టిన ఐటీ నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. ఆ సంస్థలను సోష ల్ మీడియాలో కీలక సంస్థలుగా భావిస్తామని పేర్కొం ది. ఇటీవలే ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం.. ఈ కీలక సంస్థలు నిబంధల అమలు పర్యవేక్షణ అధికారి, నోడల్ కాంటాక్ట్ అధికారి, ఫిర్యాదుల రెసిడెంట్ అధికారి అనే ముగ్గురిని నియమించాల్సి ఉంటుంది. ఈ ముగ్గురూ భారత్లోనే నివసించాలి. సంస్థ తొలగించిన కంటెంట్కు సంబంధించిన సమగ్ర సమాచారంతో ప్రతినెలా ఒక నివేదికను వారు తయారు చేయాలి. ప్రభుత్వం లేదా కోర్టులు నిషేధించిన కంటెంట్ను ఆయా సంస్థలు తమ వేదికలపై 36గంటల్లోపు తొలగించాల్సి ఉంటుంది. దేశ సార్వభౌమత్వానికి, శాంతిభద్రతలకు భంగం వాటిల్లే కంటెంట్ను అప్లోడ్ చేసిన తొలివ్యక్తి వివరాలను కోర్టులు అడిగితే ఇవ్వాల్సి ఉంటుందని నిబంధనల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఐటీ మార్గదర్శకాల్లోని మూడో భాగంలో 16వ నిబంధన అత్యవసర సమయంలో ఇంటర్నెట్ను నిలిపేసే వీలు కల్పిస్తుందని, ఇది 2009 నుంచే మార్గదర్శకాల్లో ఉందని కేంద్ర సమాచార, ప్రసారమంత్రిత్వ శాఖ తెలిపింది.