పేదల భూమి కబ్జా
ABN , First Publish Date - 2020-05-26T05:30:00+05:30 IST
నందలూరు మండలంలోని పాటూరు పంచాయతీ పరిధిలోని ఎర్రిపాపయ్యగారిపల్లె శివరామపురం వద్ద ఓ వ్యక్తి
నందలూరు, మే25 : నందలూరు మండలంలోని పాటూరు పంచాయతీ పరిధిలోని ఎర్రిపాపయ్యగారిపల్లె శివరామపురం వద్ద ఓ వ్యక్తి పేదల భూములను క బ్జా చేసి యథేచ్ఛగా కంచె వేసి కబ్జా చేశారని సోమవారం ఆ గ్రామస్థులు, ఎర్రిపాపయ్యగారిపల్లె, మొండిబట్ల, రజకులు, గంగిరెద్దుల కాలనీ వాసులు అంతా కలిసి ఎంపీపీ అభ్యర్థి మేడా విజయభాస్కర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ బ్రిక్స్ వద్ద ఉన్న శ్మశాన వాటిక స్థలాన్ని, తమకు సంబంధించిన స్థలాలను సైతం కబ్జా చేసి బెదిరిస్తున్నారని తెలిపారు. చెరువు తట్టు భూమినీ కబ్జా చేసి కంచె వేశారన్నారు. ఈ విషయాన్ని ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సర్వే చేయించి పేదల భూములను వారికే ఇప్పిస్తామని మేడా విజయభాస్కర్రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు ధనుంజయనాయుడు, రమే్షకుమార్రెడ్డి, సంజీవరాయుడు, భాస్కర్, కాకి చంద్ర, ఇలియాజ్ పాల్గొన్నారు.