భూమిని కాపాడుకోవాలి

ABN , First Publish Date - 2021-04-23T05:28:51+05:30 IST

మొక్కలను నాటి భూమిని కాపాడుకోవాలని ఎస్‌ఐ జి.అప్పారావు, మాజీ సర్పంచ్‌ పి.నేతాజీ తెలిపా రు.

భూమిని కాపాడుకోవాలి
కవిటి: మొక్క నాటుతున్న ఎస్‌ఐ అప్పారావు:

కవిటి: మొక్కలను నాటి భూమిని కాపాడుకోవాలని ఎస్‌ఐ జి.అప్పారావు, మాజీ సర్పంచ్‌ పి.నేతాజీ  తెలిపా రు. ధరిత్రి దినోత్సవం పురస్క రించుకొని గురువారం  జగతి సచివాలయం ఆవరణలో  మొక్కలు నాటారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ భూమాతను సంరక్షించుకున్న ప్పుడే మానవాళి మనుగడ సాధ్యమని చెప్పారు. కార్యక్రమంలో గ్రామస్థులు డి.బాబూరావు, పి.జోగయ్య, బి.రవి పాల్గొన్నారు. ఫగుజరాతీపేట: భూసారాన్ని పెంపొందించేందుకు, భూతా పాన్ని తగ్గించేందుకు పచ్చని చెట్లు దోహదపడతాయని  శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.శ్రీరాములు  తెలిపారు. గురువారం ధరిత్రి దినోత్సవం సంద ర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాగ్రపీ విద్యార్థులు ఆవిష్కరించిన విత్తనబంతి అనే కొత్త విధానాన్ని ప్రారంభించారు. దీనివల్ల వర్షాలకు కళాశాల ఆవరణలో మొలకలు ఏర్పడతాయని తెలిపారు. చరిత్ర, ఆర్థిక విభాగాల అధిపతులు కృష్ణారావు, ఎం.శాంతి పాల్గొన్నారు.

 

 

Updated Date - 2021-04-23T05:28:51+05:30 IST