జహుజనులు ఉద్యమించాలి

ABN , First Publish Date - 2021-04-19T04:46:38+05:30 IST

బహుజనులు రాజ్యాధికారం ఉద్యమించాలని బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు రాంబాబు పిలుపునిచ్చారు.

జహుజనులు ఉద్యమించాలి
బహిరంగ సభ వాల్‌పోస్టర్‌ను విడుదల చేస్తున్న బీఎస్‌పీ నాయకులు

- ఈనెల 30న నాగర్‌కర్నూల్‌లో బహిరంగ సభ

- బీఎస్‌పీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు రాంబాబు

- మండల కేంద్రంలో కరపత్రాలు విడుదల

ఇటిక్యాల, ఏప్రిల్‌ 18: బహుజనులు రాజ్యాధికారం ఉద్యమించాలని బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు రాంబాబు పిలుపునిచ్చారు. ఈనెల 30న నాగర్‌కర్నూల్‌లో నిర్వహించనున్న మహాత్మా జ్యోతిరావు పూలే, బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి ఉత్సవ బహిరంగ సభ కరపత్రాలను ఆదివారం మండల కేంద్రంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 80శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో వెనుకబడ్డారన్నారు. రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలన్నారు. బహిరంగ సభకు జాతీయ కో ఆర్డినేటర్‌ రామ్‌జీ గౌతమ్‌, రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్‌, రాష్ట్ర కో ఆర్డినేటర్‌ పసుపుల బాలస్వామి, శ్రీహరి ముదిరాజ్‌ తదితరులు హాజరవుతారన్నారు. సభను విజయవంతం  చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బీసన్న, నాయకులు లక్ష్మీనారాయణ, ఆనంద్‌, బాబు, దావీదు, దేవరాజు, రాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-19T04:46:38+05:30 IST