జాక్‌పాట్‌ విధానం రద్దుచేయాలి

ABN , First Publish Date - 2022-01-22T05:39:36+05:30 IST

గుర్రంకొండ మార్కెట్‌యార్డులో జాక్‌పాట్‌ విధానం రద్దుచేయాలని రైతులు డిమాండ్‌ చేశారు.

జాక్‌పాట్‌ విధానం రద్దుచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఏవో కౌశిక

గుర్రంకొండ, జనవరి 21: గుర్రంకొండ మార్కెట్‌యార్డులో జాక్‌పాట్‌ విధానం రద్దుచేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన వ్యవసాయ మండలి కమిటీ సమావేశంలో అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ జాక్‌పాట్‌ విధానం రద్దయినా గుర్రంకొండలో అమలు కావడం లేదన్నారు. మార్కెట్‌ యార్డు వ్యాపారులు అధిక కమీషన్‌ వసూలు చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు గుర్తుచేశారు. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సరఫరా అయిన ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాల సమాచారాన్ని సరిమడుగు, గుర్రంకొండ, టి.పసలవాండ్లపల్లె, నడిమికండ్రిగ, అమిలేపల్లె ఆర్బీకే సిబ్బంది తెలియజేయడం లేదని ఆయా కేంద్రాల డైరెక్టర్లు చెప్పారు. ఏవో కౌశిక, హెచ్‌వో శైలజ మాట్లాడుతూ... ఆర్బీకే సిబ్బంది సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగయ్య, డీటీ జయంతి, ముక్తార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T05:39:36+05:30 IST