ఆర్టీసీ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2022-07-03T06:41:05+05:30 IST

పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలంటూ వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం ఽనిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఆర్టీసీ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి
తిరువూరులో వామపక్ష నాయకుల ఆందోళన

వామపక్షాల ఆందోళన

తిరువూరు, జూలై 2: పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలంటూ వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం ఽనిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఆర్‌ టవర్స్‌ సెంటర్‌లో జరిగిన ఆందోళనలో  నాయకులు ఎస్‌.వి.భద్రం, షేక్‌ సుభాని మాట్లాడుతూ ఇప్పటికే ప్రజలపై వివిధ రకాల ఆర్థిక భారాలు మోపుతున్న ప్రభుత్వం, ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యులపై మరింత భారం మోపుతుందని విమర్శించారు. సామాన్యులు పల్లెవెలుగు బస్సులు సైతం ఎక్కలేని విధంగా ప్రభుత్వం చార్జీల మోతమోగిస్తుందన్నారు. తక్షణం పెంచిన బస్సు చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో సీపీఎం, సీపీఐ నాయకులు గుళ్లపల్లి  వెంకటరత్నం, ఆకుల రవి, జెట్టి శ్రీనివాసరావు, రామకృష్ణ, ఆంజనేయులు, ఉదయ్‌, ఆశోక్‌, మస్తాన్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-07-03T06:41:05+05:30 IST