కొత్త స్ట్రెయిన్ల ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేం

ABN , First Publish Date - 2021-02-25T08:40:56+05:30 IST

దేశంలో అందిస్తున్న టీకాల సామర్థ్యాన్ని న్యూస్ట్రెయిన్లు తగ్గిస్తాయనడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారమూ లేదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు.

కొత్త స్ట్రెయిన్ల ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేం

రణ్‌దీప్‌ గులేరియా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: దేశంలో అందిస్తున్న టీకాల సామర్థ్యాన్ని న్యూస్ట్రెయిన్లు తగ్గిస్తాయనడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారమూ లేదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు. వీటిపై మరింతగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, అప్పటివరకు వీటి ప్రభావంపై ఏమీ చెప్పలేమని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌ స్ట్రెయిన్‌తో పాటు దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ స్ట్రెయిన్లు కూడా భారత్‌లో ప్రవేశించాయని, వీటిని తెలంగాణ, మహారాష్ట్ర, కేరళలో గుర్తించామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-02-25T08:40:56+05:30 IST