ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ
ABN , First Publish Date - 2020-10-27T11:02:19+05:30 IST
మండల పరిధిలోని కోయిల్సాగర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి లక్ష్మయ్య కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఆంజనేయస్వామి విగ్రహాని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సోమవారం ఆవిష్కరించారు
దేవరకద్ర, అక్టోబరు 26: మండల పరిధిలోని కోయిల్సాగర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి లక్ష్మయ్య కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఆంజనేయస్వామి విగ్రహాని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విగ్రహంతో ఆధ్యాత్మిక శోభ వచ్చిందన్నారు. ప్రాజెక్టును సందర్శించే పర్యాటకులకు కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ అన్నపూర్ణ, పార్టీ మండల అధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.