బుద్ధ విగ్రహ పనులను పరిశీలిస్తున్న జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యేలు
సిర్పూర్(టి), మే 28: మండలం కేంద్రంలోని నాగమ్మ చెరువులో ఏర్పాటు చేయనున్న బుద్ధుని విగ్రహం జిల్లాకే ఆదర్శంగా నిలుస్తుందని జడ్పీ చైర్ పర్సన్కోవలక్ష్మి అన్నారు. శనివారం నాగమ్మ చెరువులో ఏర్పాటు చేయనున్న బుద్ధుడి విగ్రహ స్థలాన్ని ఆమె ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే కోనప్ప తన సొంత నిధులు రూ.కోటితో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేయడం అబినందనీ యమన్నారు. జడ్పీ వైస్చైర్మన్ కోనేరు కృష్ణారావు, ఎంపీపీలు సౌందర్య, బాసార్కర్ విశ్వనాథ్, డుబ్బుల నానయ్య, కోఆప్షన్ సభ్యుడు కీజర్ హుస్సేన్ పాల్గొన్నారు.