గర్భిణిని హత్యచేసిన భర్త

ABN , First Publish Date - 2022-08-19T05:16:07+05:30 IST

మద్యం మత్తులో అన్నం పెట్టమని కోరగా నిరాకరించిన భార్యను భర్త హత్యచేసిన సంఘటన గురువారం తెల్లవారుజామున మార్కాపురం మండలం జమ్మనపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..జమ్మనపల్లి చెంచుకాలనీకి చెందిన దాసరి అంకాలు బుధవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మూడు నెలల గర్భిణి అయిన బసవమ్మ(35) ఆ సమయంలో అన్నం పెట్టలేదు.

గర్భిణిని హత్యచేసిన భర్త
మృతిచెందిన దాసరి బసవమ్మ

మార్కాపురం, ఆగస్టు 18 : మద్యం మత్తులో అన్నం పెట్టమని కోరగా నిరాకరించిన భార్యను భర్త హత్యచేసిన సంఘటన గురువారం తెల్లవారుజామున మార్కాపురం మండలం జమ్మనపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..జమ్మనపల్లి చెంచుకాలనీకి చెందిన దాసరి అంకాలు బుధవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మూడు నెలల గర్భిణి అయిన బసవమ్మ(35) ఆ సమయంలో అన్నం పెట్టలేదు. దీంతో నిద్రపోతున్న బసవమ్మను కర్రతో కొట్టి, గుండెలపై పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. రూరల్‌ ఎస్‌ఐ సుమన్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు.  

Updated Date - 2022-08-19T05:16:07+05:30 IST