భార్యను గొడ్డలితో నరికిన భర్త

ABN , First Publish Date - 2022-08-19T05:08:51+05:30 IST

నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లికి చెందిన రమాదేవి(37)ని ఆమె భర్త కాశీరావు గొడ్డలితో నరికి హత్య చేశాడు.

భార్యను గొడ్డలితో నరికిన భర్త
రమాదేవి మృతదేహం

మహానంది, ఆగస్టు 18 : నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లికి చెందిన రమాదేవి(37)ని ఆమె భర్త కాశీరావు గొడ్డలితో నరికి హత్య చేశాడు. పోలీసుల వివరాల మేరకు.. గాజులపల్లికి చెంది న కాశీరావుకు గిద్దలూరుకు చెందిన రమాదేవితో 24 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఓ కూతురు ఉండగా ఆమెకు వివాహం చేశారు. గురువారం తెల్లవారుజామున రమాదేవి నిద్రిస్తుండగా ఆమె భర్త కాశీరావు కిరాతకంగా గొడ్డలితో తలపై దాడి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆమెను కుటుంబ సభ్యులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందింది. వివాహేతర సంబంధమే హత్య కు దారి తీసినట్లు తెలిసింది. మృతురాలి తండ్రి పుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మహానంది పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-08-19T05:08:51+05:30 IST