పెళ్లయి నెల కూడా కాకముందే పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.. భర్త బలవన్మరణం.. షాకింగ్ నిజాలు చెప్పిన మరిది

ABN , First Publish Date - 2021-12-23T00:21:44+05:30 IST

హర్యానా మిల్‌గేట్‌లోని శవనగర్‌లో ఓ ఇంటి వరండాలో మంగళవారం ఉదయం అమిత్(28)అనే వ్యక్తి రక్తపు మడుగులో అచేతనంగా పడిఉన్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులు, మృతుడి బంధువులకు సమాచారం అందించారు..

పెళ్లయి నెల కూడా కాకముందే పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.. భర్త బలవన్మరణం.. షాకింగ్ నిజాలు చెప్పిన మరిది
ప్రతీకాత్మక చిత్రం

కొన్ని చెడు అలవాట్లు.. చివరికి జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. తొలుత మనిషి అదుపులో ఉండే చెడు అలవాట్లు, పోను పోను మనిషిని అదుపుతప్పేలా చేస్తాయి. అయితే అప్పటిదాకా వెళ్లిన వారు.. వాటిని వదిలించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా మంది ఆ అలవాట్ల నుంచి బయట పడలేక.. సమస్యల వలయంలో కూరుకుపోతుంటారు. హర్యానా రాష్ట్రంలో ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. పెళ్లయి నెల కూడా కాకముందే భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..


హర్యానా మిల్‌గేట్‌లోని శవనగర్‌లో ఓ ఇంటి వరండాలో మంగళవారం ఉదయం అమిత్(28)అనే వ్యక్తి రక్తపు మడుగులో అచేతనంగా పడిఉన్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులు, మృతుడి బంధువులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులను పిలిపించి విచారించారు. మృతుడి సోదరుడు అనూప్ తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పెళ్లయిన మూడు నెలలకే నవవధువు అదృశ్యం.. ఫోన్ చేస్తే స్విచాఫ్.. అసలు నిజం తెలిసి ఆ భర్తకు..


అనూప్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌కుమార్‌ అనే వ్యక్తికి అమిత్, అనూప్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద వాడైన అమిత్.. వృత్తిరీత్యా పెయింటర్. నవంబర్ 15న రాటేరాకు చెందిన రీతూతో అమిత్‌కు వివాహమైంది. అదే నెల 24న అమిత్ తల్లి చనిపోయింది. దీంతో అమిత్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. బాధ నుంచి బయటపడేందుకు మద్యం తాగడం మొదలెట్టాడు. క్రమంగా దానికి బానిసయ్యాడు. చెడు అలవాట్లు మానుకోవాలని భర్తకు రీతూ పలుమార్లు నచ్చజెప్పింది. అయినా అతడిలో మార్పు రాలేదు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

ఊహించని కారణంతో మూడేళ్ల క్రితం చెట్టును పెళ్లి చేసుకున్న యువతి.. ఇప్పుడు ఏం చెప్తోందంటే..


భార్య దూరమయ్యాక అమిత్ మరింతగా మద్యం సేవించేవాడు. సోమవారం కూడా మద్యం ఫుల్‌గా తీసుకున్నాడు. నడవలేని పరిస్థితిలో ఉన్న అతన్ని అనూప్ తీసుకెళ్లి అతడి ఇంట్లో వదిలేసి వచ్చాడు. అయితే ఉదయం కల్లా అమిత్ శవమై కనిపించాడు. రాత్రి ఆత్మహత్య చేసుకునే క్రమంలో కేకలు వినిపించాయని స్థానికులు తెలిపారు. రోజూ కేకలు పెడుతుండేవాడని.. దీంతో ఈరోజు కూడా అలాగే అరుస్తున్నాడని అనుకున్నామని చెప్పారు. మద్యం మత్తులో కూరగాయల కత్తితో గొంతు కోసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

బస్సు టికెట్‌పై ఫోన్ నెంబర్ రాసి ఇచ్చిన కండక్టర్.. ఆ ప్రయాణికురాలు ఇచ్చిన ట్విస్ట్‌ మామూలుగా లేదుగా..!

Updated Date - 2021-12-23T00:21:44+05:30 IST