Viral news: పెళ్లైన మహిళతో ప్రేమ.. విషయం తెలుసుకున్న భర్త.. సడన్గా కిడ్నాప్.. చివరికిలా..
ABN , First Publish Date - 2021-10-10T22:49:08+05:30 IST
రాజస్తాన్లోని హనుమాన్ఘఢ్ ప్రేమ్పురా ప్రాంతంలో జగ్దీష్ మేఘ్వాల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహితతో ఇతనికి పరిచయమైంది. రానురాను పరిచయం కాస్త
వివాహ బంధం విడదీయలేనిది. కానీ కొందరు తమ చేజేతులా తప్పులు చేస్తూ.. సంసారాన్ని సర్వ నాశనం చేసుకుంటూ ఉంటారు. కొన్ని కుంటుంబాల్లో భర్తలు తప్పులు చేస్తుంటే.. మరికొన్ని కుటుంబాల్లో భార్యలు తప్పులు చేసి, చివరికి జైలు పాలవుతూ ఉంటారు. తర్వాత పశ్చాత్తాప పడినా ప్రయోజనం ఉండదని తెలుసుకుంటారు. అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరుగుతుంది. జైపూర్లో గురువారం జరిగిన ఓ ఘటన వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్లోని హనుమాన్ఘఢ్ ప్రేమ్పురా ప్రాంతంలో జగ్దీష్ మేఘ్వాల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహితతో ఇతనికి పరిచయమైంది. రానురాను పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లు గుట్టుగా వ్యవహారం నడిపించారు. తర్వాత ఈ విషయం మహిళ భర్తకు తెలిసింది. దీంతో జగ్దీష్పై కోపం పెంచుకున్నాడు. ఏదో ఒకటి చేయాలని అనుకుని.. అవకాశం కోసం ఎదురు చూశాడు.
గురువారం జగ్దీష్ బయటికి వెళ్తున్నాడని తెలిసింది. దీంతో కొందరు స్నేహితులతో కలిసి మహిళ భర్త.. దారి మధ్యలో కాపు కాశారు. జగ్దీష్ రాగానే కిడ్నాప్ చేసి, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అప్పటికే కోపంతో రగిలిపోతున్న మహిళ భర్త.. యువకుడిని దారుణంగా చితకబాదాడు. దెబ్బలను తాళలేక ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని.. అతడి ఇంటి ఎదుట పడేశారు. గమనించిన మృతుడి బంధువులు వారిని వెంటబడినా దొరకలేదు.
ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మృతుడి తల్లితండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేసి, నలుగురిని అరెస్ట్ చేశారు. అయితే మిగతా వారిని కూడా అరెస్ట్ చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలోనూ పలువురు నెటిజన్లు ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.