నేటి నుంచి వేట ప్రారంభం
ABN , First Publish Date - 2020-06-01T10:22:06+05:30 IST
సముద్రంలో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కారణంగా 61 రోజులపాటు ప్రభుత్వం వేటను
నిషేధ కాలాన్ని సడలించిన ప్రభుత్వం
నెల్లూరు(వ్యవసాయం), మే 31 : సముద్రంలో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కారణంగా 61 రోజులపాటు ప్రభుత్వం వేటను నిషేధించింది. అయితే కోవిడ్ కారణంగా వేట నిషేధ సమయం కంటే ముందు నుంచి వేటకు విరామం ప్రకటించింది. దీంతో ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమయ్యే వేట సమయాన్ని ఏప్రిల్ 1వతేదీ నుంచి అమలు చేసింది. జూన్ 15న ప్రారంభమయ్యే వేట సమయాన్ని జూన్ 1వతేదీకి మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సోమవారం నుంచి జిల్లాలో మత్స్యకారులు వేటను ప్రారంభించనున్నారు.