కొండ ఖాళీ

ABN , First Publish Date - 2022-09-27T07:41:01+05:30 IST

ఎన్నడూలేని విధంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు రోజు తిరుమల కొండ ఖాళీగా కనిపించింది.

కొండ ఖాళీ

గంటలోనే స్వామి దర్శనం


తిరుమల, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గతంలో ఎన్నడూలేని విధంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు రోజు తిరుమల కొండ ఖాళీగా కనిపించింది. సాధారణంగా పెరటాశి నెల మొదటి శనివారం తిరుమలలో రద్దీ అధికంగా ఉంటుంది. పైగా, బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న క్రమంలో రద్దీ అధికంగా కనిపిస్తుంది. అయిుతే ఈసారి మాత్రం శని, ఆది, సోమవారాల్లో తిరుమల ఖాళీగా దర్శనమిచ్చింది. అమావాస్యతో పాటు పాడ్యమి కావడంతో చాలా మంది భక్తులు తిరుమల పర్యటనను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. సోమవారం అయితే తిరుమల కొండ మొత్తం ఖాళీగా కనిపించింది.ఉదయం 7 గంటలకే కంపార్టుమెంట్లన్నీ ఖాళీ కావడంతో దర్శనానికి వెళ్లేవారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. స్వామి దర్శనానికి డైరెక్ట్‌లైన్‌ అని తెలుసుకున్న తిరుమలవాసులు మాత్రమే దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో వారికి కేవలం 40 నిమిషాల నుంచి గంట వ్యవధిలో దర్శనం పూర్తయింది. కాగా, మంగళవారం ధ్వజారోహణం అనంతరం వాహనసేవలు మొదలుకానున్న నేపథ్యంలో సాయంత్రం నుంచి రద్దీ పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2022-09-27T07:41:01+05:30 IST