కరోనా వ్యాప్తి దృష్ట్యా హైకోర్టు కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2022-01-05T00:57:22+05:30 IST
రాష్ట్రంలో కరోనా, ఒమైక్రాన్ వ్యాప్తి దృష్ట్యా తెలంగాణ
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా, ఒమైక్రాన్ వ్యాప్తి దృష్ట్యా తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యక్ష విచారణ నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష, ఆన్లైన్ విచారణపై జడ్జిలకు విచక్షణాధికారాన్ని కల్పించింది. ప్రత్యక్ష విచారణ చేపడితే కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు సూచించింది.
హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మకు కరోనా పాజిటివ్గా తేలింది. అలాగే చీఫ్ జస్టిస్తో పాటు రిజిస్ట్రార్ జనరల్ నాగార్జునకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో తమను కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాలని వారు కోరారు.