1000 ఏళ్లనాటి శైవ విగ్రహం.. 22 ఏళ్ల తర్వాత భారత్‌కు..

ABN , First Publish Date - 2020-07-31T03:38:56+05:30 IST

అదో వెయ్యేళ్లనాటి రాతి విగ్రహం.. 22 ఏళ్ల క్రితం భారత్‌ నుంచి దొంగిలించుకెళ్లారు. దీంతో అప్పటి నుంచి ఆ శైవ విగ్రహం...

1000 ఏళ్లనాటి శైవ విగ్రహం.. 22 ఏళ్ల తర్వాత భారత్‌కు..

లండన్: అదో వెయ్యేళ్లనాటి రాతి విగ్రహం.. 22 ఏళ్ల క్రితం రాజస్థాన్‌లోని ఘటేశ్వర్ ఆలయం‌ నుంచి దొంగిలించుకెళ్లారు. దీంతో అప్పటి నుంచి ఆ శైవ విగ్రహం కోసం భారత్ వెదుకుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆ విగ్రహం ఇంగ్లాండ్‌లో ఉన్నట్లు 2003లో కనుగొంది. వెంటనే అక్కడి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. దీంతో ఓ పురాతన వస్తువుల సేకర్త విగ్రహం తనవద్ద ఉందంటూ తిరిగిచ్చేశాడు. ఇంగ్లాండ్‌లోని భారత హై కమిషన్‌కు 2005లో స్వచ్ఛందంగా అందజేశాడు. దీంతో అప్పటి నుంచి అక్కడే ఉన్న ఈ విగ్రహం ఇన్నేళ్ల తర్వాత భారత్‌కు చేరనుంది. ఈ మేరకు ఇంగ్లాండ్‌లోని భారత హైకమిషన్ తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది.



Updated Date - 2020-07-31T03:38:56+05:30 IST