గ్రాండ్గా ‘ది హ్యాండ్క్రాఫ్టర్స్ - ఏ కలెక్టివ్ ఆఫ్ ఆర్టిసన్స్’ ఎగ్జిబిషన్
ABN , First Publish Date - 2022-07-16T05:45:20+05:30 IST
విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్లో శుక్రవారం వైజాగ్ మేయర్ గోళగాని హరి వెంకటా కుమారి, భాజపా ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి, సినీ నిర్మాత నాగసుశీల మరియు నిర్వహకులు యార్లగడ్డ రజనీ కలిసి ‘ది హ్యాండ్క్రాఫ్టర్స్ - ఏ కలెక్టివ్ ఆఫ్ ఆర్టిసన్స్’ పేరుతో
విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్లో శుక్రవారం వైజాగ్ మేయర్ గోళగాని హరి వెంకటా కుమారి, భాజపా ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి, సినీ నిర్మాత నాగసుశీల మరియు నిర్వహకులు యార్లగడ్డ రజనీ కలిసి ‘ది హ్యాండ్క్రాఫ్టర్స్ - ఏ కలెక్టివ్ ఆఫ్ ఆర్టిసన్స్’ పేరుతో జరుగుతున్న ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం మేయర్ గోళగాని హరి వెంకటా కుమారి మాట్లాడుతూ.. దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రఖ్యాతిగాంచిన చేనేత ఉత్పత్తులను ఒక చోటకి చేర్చి.. తద్వారా చేనేత కళాకారులకు చేయూతనివ్వడంతోపాటు చేనేత ఉత్పత్తులను కళాభిమానుల చెంతకు చేర్చేందుకు రజనీగారు కృషి చేయడం అభినందనీయం.. అని అన్నారు.
దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. ‘‘మన భారతదేశంలో వ్యవసాయం రంగం తర్వాత అత్యధిక ఉపాధి కల్పించే రంగం చేనేత రంగం. మన దేశములో, రాష్ట్రంలో ఈ రంగంలో ప్రత్యేకమైన నైపుణ్యత ఉన్నటువంటి నేపథ్యం మనది. చేనేత ఉత్పత్తులకు ఎప్పుడూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఏళ్లు గడిచినా, ఫ్యాషన్ మారినా, చేనేతకు ఉండే ప్రాధాన్యత.. ప్రాముఖ్యత అలానే ఉంటుంది. చేనేత ఉత్పత్తులను ప్రేమించే కళకారులు నిత్యం వాటి కొనుగోలుకే ఆసక్తి చూపుతారు. అలాంటి చేనేత ఉత్పత్తులతో కూడిన ప్రదర్శనను యార్లగడ్డ రజనీగారు ‘ది హ్యాండ్క్రాఫ్టర్స్ - ఏ కలెక్టివ్ ఆఫ్ ఆర్టిసన్స్’ పేరుతో మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది..’’ అని అన్నారు.
అనంతరం యార్లగడ్డ రజనీ మాట్లాడుతూ.. ‘‘మేము భారతదేశం మొత్తం ఈ చేనేత ప్రదర్శన పెడుతున్నాము. శుక్రవారం విశాఖపట్నంలో ఒకే ఒక్క రోజు ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నాము. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ నేత కార్మికులు, డిజైనర్లు మరియు క్రాఫ్ట్ తయారీదారులు తమ కళలను, ఉత్పత్తులను ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ ప్రదర్శనలో పటాన్ పటోలా, కంచి, బనారసి, జమ్దానీ, గద్వాల్, కోట, మంగళగిరి చీరలు మరియు డ్రెస్ మెటీరియల్స్, దుపట్టాలు, పొట్లీలు, బ్యాంగిల్స్, హోమ్ లినెన్ బ్యాగులు మరియు డ్రెస్లను ప్రదర్శించనున్నాము. అలాగే, అనేక రకాల చేతితో తయారు చేసిన నగలు, విలువైన రత్నాలు మరియు వజ్రాలు ఏర్పాటు చేశాము..’’ అని తెలిపారు.