9లోగా హరితహారాన్ని పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-08-05T05:12:54+05:30 IST

జిల్లాలో చేపడుతున్న ఏడవ విడత హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అధికారులను ఆదేశించారు.

9లోగా హరితహారాన్ని పూర్తి చేయాలి
బోరజ్‌లో నాటుతున్న మొక్కలను పరిశీలిస్తున్న కలెక్టర్‌

జైనథ్‌, ఆగస్టు 4:  జిల్లాలో చేపడుతున్న ఏడవ విడత హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం 44వ జాతీయ రహదారి చెక్‌పోస్టు ఆధ్వర్యంలో ఈజీఎస్‌, అటవీశాఖ ఆధ్వర్యంలో నాటుతున్న మొక్కలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కకు నీరుపోసి సంరక్షించాలన్నారు.  ఇందులో డీఎఫ్‌వో రాజశేఖర్‌, డీఆర్‌డీవో పీడీ కిషన్‌, అడిషనల్‌ పీడీ రవీందర్‌, డీపీవో శ్రీనివాస్‌, ఎంపీడీవో గజానన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-08-05T05:12:54+05:30 IST