శ్రామికుల పక్షాన నిలబడ్డ మహా కవి గుర్రం జాషువా: వీసీ
ABN , First Publish Date - 2021-07-25T05:13:52+05:30 IST
శ్రామికుల పక్షాన నిలబడ్డ మహా కవి గుర్రం జాషువా అని వీసీ సూర్యకళావతి అన్నారు.
కడప వైవీయూ, జూలై 24: శ్రామికుల పక్షాన నిలబడ్డ మహా కవి గుర్రం జాషువా అని వీసీ సూర్యకళావతి అన్నారు. వైవీయూ, నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ వెబ్నార్ సదస్సుకు వీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళితులు, మహిళల పట్ల జాషువా ప్రదర్శించిన వైఖరి ఎంతో గొప్పదన్నారు. రాష్ట్ర పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి, సింహపురి యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ మాట్లాడుతూ జాషువా మరణంలేని కవిగా ప్రజల నాలుకలపై ఎన్నటికి నిలిచిపోతారన్నారు.