శ్రామికుల పక్షాన నిలబడ్డ మహా కవి గుర్రం జాషువా: వీసీ

ABN , First Publish Date - 2021-07-25T05:13:52+05:30 IST

శ్రామికుల పక్షాన నిలబడ్డ మహా కవి గుర్రం జాషువా అని వీసీ సూర్యకళావతి అన్నారు.

శ్రామికుల పక్షాన నిలబడ్డ మహా కవి గుర్రం జాషువా: వీసీ

కడప వైవీయూ, జూలై 24: శ్రామికుల పక్షాన నిలబడ్డ మహా కవి గుర్రం జాషువా అని వీసీ సూర్యకళావతి అన్నారు. వైవీయూ, నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ వెబ్‌నార్‌ సదస్సుకు వీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళితులు, మహిళల పట్ల జాషువా ప్రదర్శించిన వైఖరి ఎంతో గొప్పదన్నారు. రాష్ట్ర పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి, సింహపురి యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ జాషువా మరణంలేని కవిగా ప్రజల నాలుకలపై ఎన్నటికి నిలిచిపోతారన్నారు.  

Updated Date - 2021-07-25T05:13:52+05:30 IST