అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
ABN , First Publish Date - 2021-01-25T06:21:05+05:30 IST
అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చే స్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
- మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మారం, జనవరి 24: అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చే స్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం మంత్రి క్యాంపు కార్యాల యంలో రామయ్యపల్లిలో యాదవసంఘ భవన నిర్మాణానికి డీఎంఎఫ్టీ కింద రూ.4.60లక్షల నిధుల మంజూరు ప్రొసీడింగ్ను కులస్థులకు మంత్రి అందజేశా రు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తోందని చెప్పారు. నంది మేడారం సింగిల్విండో చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి,మండల బీసీసెల్ అధ్యక్షు డు మల్లేశం, యాదవ సంఘం ఉపాధ్యక్షుడు మహేష్ పాల్గొన్నారు.