రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-07-10T10:52:12+05:30 IST

రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు

రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం

జన్నారం, జూలై 9: రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. గురు వారం చింతగూడ, తిమ్మాపూర్‌, కలమడుగు గ్రామాల్లో పర్యటించారు. చింతగూడలో రైతుల ఐక్య వేదిక భవన నిర్మా ణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ రైతుల ఐక్య వేదిక వల్ల రైతాంగానికి న్యాయం జరుగు తుందని, రైతులు అన్ని విధాలుగా అభివద్ధి చెందే విధంగా ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందిస్తుందన్నారు. రైతు ఐక్య వేదికల వల్ల పండించిన పంటను విక్రయించుకోవచ్చని అన్నారు. 


అనంతరం తిమ్మాపూర్‌, కలమడుగులలో వైకుంఠధామా లను ప్రారంభించారు. పలు రైతుల ఐక్యవేదికల నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాజారాంరెడ్డి, వ్యవసాయ జిల్లా అధికారి వీరయ్య, జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్‌, ఎంపీపీ మాదాడి సరోజన, వైస్‌ ఎంపీపీ సుతారి వినయ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముత్యం సతీష్‌, టీఎస్‌ఈఎస్‌ చైర్మన్‌ సిడాం రమేష్‌, భరత్‌కుమార్‌, మున్వర్‌ అలీ, జనార్ధన్‌, జాడి గంగాధర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-10T10:52:12+05:30 IST