ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలి
ABN , First Publish Date - 2022-01-27T04:54:05+05:30 IST
ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించినప్పుడే అబివృద్ధి జరుగుతుందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ పేర్కొన్నారు.
మైలవరం, జనవరి 26 : ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించినప్పుడే అబివృద్ధి జరుగుతుందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రామచంద్రాయపల్లి, దొడియం, నక్కావానిపల్లి, పెద్దకొమెర్ల, దొమ్మరనంద్యాల గ్రామాల్లో దండు వీరయ్య మాదిగ సుడిగాలి పర్యటన చేశారు. ఈ కార్యక్రమంలో డప్పు చర్మకారుల రాష్ట్ర మాజీ కన్వీనర్ నాగభూషణం మాదిగ, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుమలయ్య, మైలవరం మండల మాజీ కన్వీనర్ విజయకుమార్ మాదిగ, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.