ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు
ABN , First Publish Date - 2021-03-04T05:38:14+05:30 IST
వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యు డు కిమిడి కళావెంకటరావు పేర్కొన్నారు.
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కళావెంకటరావు ఫ చిల్లపేటరాజాం బాధితులకు పరామర్శ
రణస్థలం: వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యు డు కిమిడి కళావెంకటరావు పేర్కొన్నారు. చిల్లపేటరాజాం గ్రామంలో ఇటీవల వైసీపీ నేతల దాడిలో గాయపడిన టీడీపీ నాయకులను ఆయన బుధవారం పరామర్శించారు. అలాగే, ఈ ఘటనలో ధ్వంసమైన ఆస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా కళావెంకటరావు మాట్లాడుతూ, టీడీపీ మద్దతుదారులకు చెందిన ద్విచక్ర వాహనాలు, టీవీలు, విలువైన సామగ్రిని ధ్వంసం చేయడం దారుణమన్నారు. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడితే ఉపేక్షించేదిలేదన్నా రు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గొర్లె విజయ్కుమార్, నాయకులు శ్రీనివాసరెడ్డి, రామారావు, ఆదినారాయణ, కనకారావు తదితరులు పాల్గొన్నారు. లావేరు: బెజ్జి పురం ఉమారామలింగేశ్వరస్వామిని కళావెంకటరావు బుధవారం దర్శించుకున్నారు.ఉత్తరాంధ్ర సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామి, మండల టీడీపీ అధ్యక్షుడు ముప్పిడి సురేష్, బెజ్జిపురం మాజీ సర్పంచ్ ఇజ్జాడ శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.