వీఆర్‌వోలను విస్మరిస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-12-06T16:13:48+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం..

వీఆర్‌వోలను విస్మరిస్తున్న ప్రభుత్వం

జోనల్‌ వ్యవస్థలో అవకాశం కల్పించాలి: వీఆర్‌వోల సంఘం


రాష్ట్ర ప్రభుత్వం వీఆర్‌వోలను పూర్తిగా విస్మరిస్తోందని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆరోపించింది. 5,485 మంది వీఆర్‌వో పోస్టులను రద్దు చేసి 15 నెలలు అవుతున్నా.. నేటి వరకు ఎలాంటి జాబ్‌ చార్ట్‌ ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆదివారం జరిగిన సంఘం రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీశ్‌ మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లతోపాటు కనీసం కారుణ్య నియామకాలు కూడా చేపట్టడం లేదన్నారు. జోనల్‌ వ్యవస్థలో ఆప్షన్‌ల కోసం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినందున.. వీఆర్‌వో పోస్టుకు సరిసమానమైన హోదా కలిగిన ఉద్యోగిగా గుర్తించి జోనల్‌ వ్యవస్థలో ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-12-06T16:13:48+05:30 IST