గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

ABN , First Publish Date - 2022-05-24T05:07:01+05:30 IST

: గ్రామాల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోం దని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలు అన్నారు. సోమ వారం అంకుశం నుంచి ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు రూ. 1.20 కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులతో చేపట్టిన రోడ్డు పనులను ప్రారంభించారు.

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
రోడ్డు పనులకు శంకుస్ధాపన చేస్తున్న ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే

బెల్లంపల్లి, మే 23: గ్రామాల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోం దని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలు అన్నారు. సోమ వారం అంకుశం నుంచి ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు రూ. 1.20 కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులతో చేపట్టిన రోడ్డు  పనులను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో ఎన్నో ఏండ్లుగా అంకుశం ప్రజ లు రోడ్డు లేక ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామానికి రోడ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. గ్రామాల అభివృ ద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ప్రవీణ్‌, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ సత్యనారాయణ, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. 

ఫ చెన్నూరురూరల్‌: సీఎం కేసీఆర్‌తోనే గ్రామాల్లో మెరుగైన రవాణా సౌక ర్యాలు ఏర్పడ్డాయని ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పేర్కొ న్నారు.  కిష్టంపేట సమీపంలో ప్రధా న రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని రహదారులు, బ్రిడ్జిల నిర్మాణానికి సుమారు రూ.100 కోట్ల నిదులు మంజూరయ్యాయని తెలిపారు. వాగులపై వంతెనలు లేక ప్రజలు ఇబ్బం దులు పడ్డారని తెలిపారు. రూ.3.50 కోట్లతో బ్రిడ్జి నిర్మి స్తున్నట్లు తెలిపారు. సుద్దాల వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. కిష్టం పేట బ్రిడ్జి పనులు పూర్తయ్యాయని తెలిపారు.  సర్పంచు బుర్ర రాకేష్‌గౌడ్‌, నాయకులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-24T05:07:01+05:30 IST