సర్కార్‌ రియల్టర్‌గా మారింది: కోదండరాం

ABN , First Publish Date - 2021-07-17T20:28:46+05:30 IST

ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తోందని టీజేఎస్ అధినేత కోదండరాం ఆరోపించారు. శనివారం ఆయన

సర్కార్‌ రియల్టర్‌గా మారింది: కోదండరాం

హైదరాబాద్‌: ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తోందని టీజేఎస్ అధినేత కోదండరాం ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, రక్షించలేమని ప్రభుత్వమే చెబుతోందని తప్పుబట్టారు. భూములను కాపాడలేని ప్రభుత్వం ప్రజలను ఎలా కాపాడుతుంది? అని కోదండరాం ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను ధనవంతులకు అప్పగించకుండా ప్రజావసరాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు. న్యాయ వేదికలను ఉపయోగించుకుని భూముల అమ్మకాన్ని అడ్డుకుంటామని కోదండరాం ప్రకటించారు. 

Updated Date - 2021-07-17T20:28:46+05:30 IST