ఆడబిడ్డల ఆనందమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-01-17T06:29:53+05:30 IST

ఆడబిడ్డల కళ్లల్లో ఆనందమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అందుకే పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల ఖర్చుల కోసం ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక చేయూత అందిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు.

ఆడబిడ్డల ఆనందమే ప్రభుత్వ లక్ష్యం
కల్యాణలక్ష్మి చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

- ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

రాయికల్‌, జనవరి 16: ఆడబిడ్డల కళ్లల్లో ఆనందమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అందుకే పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల ఖర్చుల కోసం ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక చేయూత అందిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం మండలంలోని ఇటిక్యాల, మూటపెల్లి, అల్లీపూర్‌ క్లస్టర్ల్ల పరిధిలో 106 మంది ఆడపడుచులకు రూ.1కోటి 6లక్షల 12వేల విలువ గల కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 17లక్షల విలువైన చెక్కులను 52 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి,  మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, వైస్‌ చైర్మన్‌ గండ్ర రమాదేవి, తహసీల్దార్‌ మహేశ్వర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ గన్నెరాజరెడ్డి, కోల్లూరి వేణు, సింగిల్‌విండో చైర్మన్‌ ఏనుగు మల్లారెడ్డి, పార్టీ మండలశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోల శ్రీనివాస్‌, రాజేష్‌, పట్టణ అధ్యక్షుడు ఇంతియాజ్‌, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-17T06:29:53+05:30 IST